న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 స్కూటర్ల వినియోగదారులకు ఓ అవకాశం ఇచ్చింది. కొత్త ఫ్రంట్ ఫోర్క్తో ఎస్1 స్కూటర్లను అప్గ్రేడ్ చేసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది.
ఈ విడిభాగానికి సంబంధించి వాహనదారుల నుంచి భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈ ఛాన్స్ ఇస్తున్నట్టు ఓలా స్పష్టం చేసింది. ఇక ఈ అప్గ్రేడ్ ఉచితంగానే పొందవచ్చని పేర్కొన్నది. ఈ నెల 22 నుంచి అప్గ్రేడ్ కోసం సంప్రదించవచ్చు.