న్యూఢిల్లీ, నవంబర్ 14: ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏండ్లు. 1934లో సిమ్లాలో ఓ చిన్న హోటల్తో ప్రారంభమైన ఒబెరాయ్ ప్రస్థానం.. ఏడు దేశాలకు విస్తరించింది.
ఒబెరాయ్ గ్రూప్ను రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఒబెరాయ్ ప్రారంభించారు. ఆపై దీన్ని పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ నడిపించారు. ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్, ట్రైడెంట్ హోటళ్లు, మైడెన్ హోటల్స్ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.