అరెస్ట్ చేసిన ఈడీ
నిందితుల జాబితాలో మాజీ ముంబై
పోలీస్ కమీషనర్ సంజయ్ పాండే
న్యూఢిల్లీ, జూలై 14: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లొకేషన్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆ ఎక్సేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను మరో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్ట్ చేసింది. కో-లోకేషన్ కేసులో మార్చి నెలలో సీబీఐ అరెస్ట్ చేసిన చిత్రాను తాజాగా నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసుపై విచారించేందుకు నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. అలాగే ముంబై మాజీ పోలీస్ కమీషనర్ సంజయ్ పాండేపై కూడా ఈడీ కేసు పెట్టింది. చిత్రాతో పాటు ఎన్ఎస్ఈ మాజీ ఎండీ రవి నారాయణ్, సంజయ్ పాండేలపై వారం రోజుల క్రితమే సీబీఐ ఫోన్ ట్యాపింగ్ కేసును నమోదు చేయగా, ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ కేసు రిజిష్టర్ చేసింది. వివరాలివి…