Kisan Vikas Patra | పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్పై వడ్డీరేట్లు పెరిగాయి. దీంతో పోస్టాఫీసు నిర్వహించే కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) స్కీమ్పై వడ్డీరేటు 6.9 నుంచిఏడు శాతానికి పెరిగింది. దేశంలోని అతి పెద్ద బ్యాంకులు సైతం ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా ఆరు శాతం వడ్డీరేట్లు మాత్రమే ఇస్తున్నాయి. మీరు కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరిన్ని లాభాలు పొందొచ్చు.
కిసాన్ వికాస్ పత్ర ఖాతాలను ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయొచ్చు. ఒక పోస్టాఫీసు నుంచి మరొక పోస్టాఫీసుకు కూడా బదిలీ చేయడానికి వెసులుబాటు ఉంది. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కూడా.
18 ఏండ్ల వయస్సు దాటిన వారు మాత్రమే కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. జాయింట్ అకౌంట్లలో మైనర్లు కూడా చేరొచ్చు. అయితే, మైనర్లు ఉన్న ఖాతాలను వారి తల్లిదండ్రులు పర్యవేక్షిస్తుండాలి.
కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడులు పెట్టిన తర్వాత అత్యవసరం అయినా డబ్బు విత్ డ్రా చేయకుండా లాకిన్ పీరియడ్ ఉంది. కనీసం రెండున్నరేండ్ల వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఏడు శాతం వడ్డీరేటు ప్రకారం కిసాన్ వికాస్ పత్రలో ఇన్వెస్ట్మెంట్ 10 ఏండ్ల మూడు (124 నెలల్లో ) నెలల్లో రెట్టింపు అవుతుంది.