HeatWave Effect on Mango Exports | బియ్యం, గోధుమల ధరలు మాత్రమే కాదు.. దేశంలో పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు విదేశాలకు మామిడి పండ్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. భారత్లోనే మామిడి పండ్లు అత్యధికంగా పండే ఉత్తరప్రదేశ్లో ఎండటల వల్ల దిగుబడి పడిపోయింది. ఫలితంగా స్థానికంగానే మామిడి పండ్ల ధరలు పెరిగిపోయాయి. తక్కువ దిగుబడుల వల్ల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్, ఖతార్, కువైట్లకు ఎగుమతులు తగ్గిపోతాయని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రతియేటా భారతదేశంలో 21-23 మిలియన్ టన్నుల మామిడి పండ్లు దిగుబడి అవుతాయి. భారత్లోని మామిడి పండ్ల దిగుబడిలో ఉత్తరప్రదేశ్ వాటా 23.47 శాతం. కానీ అధిక ఉష్ణోగ్రతల వల్ల మామిడి పూత మాడిపోయింది. సాధారనంగా 27 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద మామిడి కాయలు తయారవుతాయి.
మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎస్ ఇన్స్రాం అలీ మాట్లాడుతూ ఈ ఏడాది మామిడి ఎగుమతులపై సందేహాలు మాకు ఉన్నాయి. మిగిలిన మామిడి పండ్లు దేశంలోనే విక్రయించాల్సిందే అని అన్నారు. ఎండ వేడి, ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల దేశంలో టొమాటోతోపాటు మామిడి ధర కిలో రూ.100 దాటింది.