న్యూఢిల్లీ, జూలై 15: ఐటీ రిటర్నుల గడువు పెంపు ప్రతిపాదనేది తమ వద్ద లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా స్పష్టంచేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల గడువు ఈ నెల 31న ముగియనున్న నేపథ్యంలో ఈ గడువును పెంచుతారని వార్తలు గుప్పుమంటున్నాయి. అలాంటి ప్రతిపాదనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద లేదని, పన్ను చెల్లింపుదారులు గడువు కంటే ముందుగానే రిటర్నులు దాఖలు చేయాలని సంజయ్ మల్హోత్రా సూచించారు.