రాయిచూర్, ఆగస్టు 27: తృణ ధాన్యాలకు విలువ చేకూర్చడంలో, వాటి బ్రాండింగ్ కోసం వినూత్న సొల్యూషన్లను డిజైన్, డెవలప్ చేయడానికి స్టార్టప్ సంస్థలకు ‘మిల్లెట్ ఛాలెంజ్’ నిర్వహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఛాలెంజ్లో గెలుపొందిన ముగ్గురు విజేతలకు రూ. 1 కోటి చొప్పున సీడ్ గ్రాంట్స్ అందచేస్తామన్నారు. కర్నాటకలోని రాయిచూర్లో వ్యవసాయ వర్సిటీ, నాబార్డ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మిల్లెట్ కాంక్లేవ్లో మంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ ఛాలెంజ్లో స్టార్టప్స్తో కలిసి యువతతో సహా ఎవరైనా పాల్గొనవచ్చని, వినూత్న మార్గాల్లో సొల్యూషన్స్ను అందించవచ్చని తెలిపారు. ముగ్గురు విజేతలకు ఒక కోటి రూపాయిల చొప్పున గ్రాంట్తో పాటు ఎంపికైన 15 మందికి రూ. 20 లక్షల చొప్పున, ఎంపికైన మరో 15 మందికి రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ లభిస్తుందన్నారు.