న్యూఢిల్లీ, నవంబర్ 30: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకనీ, డీఎల్ఎఫ్ చైర్మన్ ఎమిరేట్స్ కేపీ సింగ్, జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు దాతృత్వంలో తమ పెద్ద మనసును చాటుకున్నారు. గురువారం విడుదలైన ఫోర్బ్స్ ఆసియా ఫిలంత్రఫీ హీరోల 17వ జాబితాలో నిలేకనీ ఐఐటీ బాంబేకు రూ.320 కోట్లకుపైగా ఇచ్చినట్టు స్పష్టమైంది. ఇక్కడే నిలేకనీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. కాగా, సంపదతోపాటు, వ్యక్తిగత సమయాన్ని తాము ఎంచుకున్న కారణాల కోసం వెచ్చించినవారితో ఈ లిస్టును ఫోర్బ్స్ సిద్ధం చేసింది.
అయితే ఈ వార్షిక జాబితాలో కార్పొరేట్ ఫిలంత్రఫీని చేర్చలేదు. ఇక 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్గా దిగిపోయిన కేపీ సింగ్.. తన పేరుపై ఫౌండేషన్ ట్రస్టు, చారిటబుల్ ట్రస్టులను స్థాపించి సహాయం చేశారు. ఈయన మొత్తం సంపద 14 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. నిఖిల్ కామత్ తన యూట్యూబ్ పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా విరాళాలిచ్చారు. ఈయన సంపద 1.1 బిలియన్ డాలర్లుగా ఉన్నది.