ముంబై, మార్చి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. వరుసగా రెండు రోజులపాటు పెరిగిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లో సెంటిమెంట్ను దెబ్బతీశాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్ది భారీ నష్టాల్లోకి జారుకున్నది. ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 360.96 పాయింట్లు తగ్గి 57,628.95 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 111.65 పాయింట్లు కరిగిపోయి 16,988.40 వద్దకు జారుకున్నది. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతుండటం, ఈవారంలోనే ఫెడ్ మరోసారి వడ్డీరేట్లను పెంచనున్నదన్న భయాలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి.
బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టాటా స్టీల్, టాటా మోటర్స్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మారుతి, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎల్అండ్టీ షేర్లు 4 శాతం వరకు నష్టపోయాయి.
అదానీ గ్రూపు సూచీలు నేలచూపు
స్టాక్ మార్కెట్లో లిైస్టెన అదానీ గ్రూపునకు చెందిన 10 స్టాకుల్లో తొమ్మిది నష్టపోయాయి. గతవారం రోజులుగా భారీగా పెరిగిన గ్రూపు షేర్లు సోమవారం నాలుగు శాతం వరకు నష్టపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు 3.84 శాతం తగ్గగా..అదానీ టోటల్ గ్యాస్ 4.99 శాతం, అదానీ పవర్ 4.83 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 1.49 శాతం, అంబుజా సిమెంట్ 3.37 శాతం, అదానీ విల్మార్ 3.16 శాతం, ఎన్డీటీవీ 3.11 శాతం, ఏసీసీ 1.84 శాతం, ఏపీ సెజ్ 1.96 శాతం వరకు నష్టపోయాయి. కానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ మాత్రం 3.91 శాతం లాభపడింది.