హైదరాబాద్, ఆగస్టు 5: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఎఫ్డీబీ గురువారం ఇక్కడ ఎంవోయూ కుదుర్చుకున్నది. ఫిషరీస్ రంగానికి బ్యాంక్ నుంచి ఆర్థిక సాయం పొడిగింపునకు వీలుగా ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్-ఎన్ఎఫ్డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సువర్ణ చంద్రప్పగారి, పీఎన్బీ ఎండీ, సీఈవో ఎస్ఎస్ మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.