హైదరాబాద్, ఏప్రిల్ 25 : మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త పికప్ వాహనాలను విడుదల చేసింది. హెచ్డీ సిరీస్, సిటీ సిరీస్లలో వచ్చిన ఈ వాహనాల ధర రూ.7.85 లక్షల నుంచి రూ.13.13 లక్షల శ్రేణిలో ఉన్నది. ఇందులో 50 నూతన ఫీచర్స్ను తెచ్చారు.
వీటిలో మొబైల్ యాప్ ద్వారా వాహనం ఎక్కడ ఉన్నదో, రూట్ ప్లానింగ్, ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్, జీయో-ఫెన్సింగ్, వాహన మానిటరింగ్ వంటివి ఉన్నాయి. ఈ యాప్ తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పనిచేయనున్నది. దీని మైలేజీ 17.2 కిలోమీటర్లు.