హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ (ఐడబ్ల్యూఎన్) చైర్-ఉమెన్గా ఫాక్స్ మండల్స్ హైదరాబాద్ హెడ్ పూర్ణిమా కాంబ్లీ నియమితులయ్యారు. అలాగే అలియన్స్ అండ్ పార్ట్నర్షిప్స్, యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్ హెడ్ డా. ఉమా ఐసోలా వైస్ చైర్-ఉమెన్గా ఎన్నికైనట్లు సీఐఐ తెలంగాణ శాఖ వెల్లడించింది. పూర్ణిమకు కార్పొరేట్, కమర్షియల్ లా, రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్, విదేశీ పెట్టుబడుల లీగల్ కన్సల్టెన్సీలో 23 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నట్లు వారు తెలిపారు.