జడ్ఎక్స్-10ఆర్ రూ.14.99 లక్షలు
న్యూఢిల్లీ, మార్చి 17: సూపర్ బైక్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జపాన్ సంస్థ కవాసకీ.. సరికొత్త హంగులతో నీంజా జడ్ఎక్స్-10ఆర్ బైక్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. లైమ్ గ్రీన్, ప్లాట్ ఎబోనీ టైప్-2 రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.14.99 లక్షలుగా నిర్ణయించింది. పాత మోడల్తో పోలిస్తే అప్డేటెడ్ నీంజా జడ్ఎక్స్-10ఆర్లో పలు మార్పులు చేయడంతోపాటు బైక్ పనితీరును కూడా మెరుగుపర్చినట్లు కవాసకీ కంపెనీ తెలిపింది.