IMPS | న్యూఢిల్లీ, జనవరి 29: బెనిఫిషియరీ పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్తో సంబంధం లేకుండానే బ్యాంక్ ఖాతాల మధ్య ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా రూ.5 లక్షలదాకా బదిలీ చేసుకోవచ్చు. వచ్చే నెల 1 నుంచి ఈ అవకాశం ఖాతాదారులకు అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు గతేడాది అక్టోబర్ 31నే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సర్క్యులర్ను విడుదల చేసింది.
దీంతో ఫిబ్రవరి 1 నుంచి మనం ఎవరికైతే నగదును పంపుతున్నామో వారి బ్యాంక్ ఖాతా నంబర్, ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్లను జత చేయాల్సిన అవసరం లేకుండా పోతున్నది. మొబైల్ నంబర్, బ్యాంక్ పేరుంటే చాలు. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ యాప్లో పూర్తిగా అన్ని వివరాలను పేర్కొనాల్సి వస్తున్నది. కాగా, ఐఎంపీఎస్ అనేది ఓ నిరంతర నగదు బదిలీ వ్యవస్థ. దేశీయ డిజిటల్ లావాదేవీల్లో దీనికి ప్రాధాన్యత ఉన్నది తెలిసిందే.
ఐఎంపీఎస్ విధానమిది..