న్యూఢిల్లీ, జూన్ 27: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో..దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. ప్యాషన్ ప్లస్లోనే డిస్క్ బ్రేక్ రకాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎంట్రీలెవల్ మోటర్సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా మాడల్ను తీసుకొచ్చినట్టు, ఈ బైకు ధర రూ.84.128గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. పాత మాడల్తో పోలిస్తే ఈ నయా మాడల్ను సరికొత్తగా తీర్చిదిద్దినట్టు, పూర్తిస్థాయిలో డిజిటల్ ఇన్స్ట్రమెంట్ క్లస్టర్, మైలేజీ ఇండికేట్, తక్కువ పెట్రోల్ వార్నింగ్, సర్వీసెస్ రిమైండర్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్ను తిలకించవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 100 సీసీ ఇంజిన్తో తయారైన ఈ బైకు 5.9 కిలోవాట్ల శక్తినివ్వనున్నదని, లీటర్ పెట్రోల్కు 71 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.