శంషాబాద్ రూరల్, మార్చి 21: అంతర్జాతీయ కొరియర్, ఎక్స్ప్రెస్ కార్గో సరుకుల నిర్వహణకు హైదరాబాద్ జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కొత్త కేంద్రం అందుబాటులోకి వచ్చింది. సోమవారం ఈ మేరకు జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ప్రకటించింది. కస్టమ్స్ చీఫ్ కమిషనర్ బివి శివనాగ కుమారి దీన్ని ప్రారంభించారు. ఈ రీజియన్ నుంచి కొరియర్, కార్గో సరుకుల ఎగుమతి-దిగుమతులకు ఈ కేంద్రం మరింత దోహదపడగలదని ఈ సందర్భంగా ఎయిర్పోర్టు వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ కార్యక్రమంలో జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్జీకే కిశోర్, జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ ఫణికర్ పాల్గొన్నారు.