ధర రూ.1.14 లక్షలు
ముంబై, మే 12: దేశీయ మార్కెట్లోకి సరికొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ను పరిచయం చేసింది పియాజియో. ఈ స్కూటర్ ధరను రూ.1.14 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు పుణె షోరూంనకు సంబంధించినవి. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద రూ.5 వేలు ముందస్తుగా చెల్లించి ఈ స్కూటర్ను బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. బెస్ట్ రైడింగ్ అనుభవం కోరుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన ఈ స్కూటర్..మరింత పొడువుగాను, వెడల్పు, సౌకర్యవంతంగా ఉండే విధంగా డిజైన్ చేసింది.