హైదరాబాద్, ఆగస్టు 24: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న నెఫ్రోప్లస్.. అతిపెద్ద డయాలసిస్ సెంటర్ను ప్రారంభించింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ప్రపంచంలో అతిపెద్దది కావడం విశేషం. ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో డయాలసిస్ నిర్వహించనున్నారు. 160 పడకలు కలిగిన ఈ సెంటర్లో 900కి పైగా రోగులకు చికిత్స చేయడానికి వీలు పడనున్నది. ఉజ్బెకిస్తాన్లోని బొగాట్, ఉర్జేంచ్ వద్ద ఒక్కో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది ప్రకటించిన విషయం తెలిసింది.