NR Narayana Murthy | దేశ అభివృద్ధిపై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మౌలిక వసతుల రంగంలో మూడు షిఫ్టుల్లో పని చేయాలని, అప్పుడే చైనాను భారత్ అధిగమించ గలదని పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన టెక్ సమ్మిట్లో జిరోధా కో- ఫౌండర్ నిఖిల్ కామత్తో జరిగిన చర్చాగోష్టిలో నారాయణ మూర్తి మాట్లాడుతూ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో, ఇతర మెట్రోలు పూర్తి కావాలంటే మౌలిక వసతుల రంగంలో మూడు షిఫ్టుల పని విధానం రావాలన్నారు.
విదేశాలతో పోటీ పడాలంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల షిఫ్ట్ ఏమాత్రం సరిపోదని ఎన్ఆర్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.కనీసం రెండు షిఫ్టులైనా పని చేయాలని స్పష్టం చేశారు. అప్పుడే చైనా వంటి దేశాలను అధిగమించలమని పేర్కొన్నారు. ఆ దిశగా ఉన్న అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వాలు చొరవ చూపాల్సి ఉందన్నారు.
చాట్జీపీటీ టెక్నాలజీ ఆవిష్కరణతో జీవితాల మెరుగుదలకు, ఉత్పాదకత పెంపునకు ఉపకరిస్తుందని ఎన్ ఆర్ నారాయణమూర్తి తెలిపారు. మారుతున్న టెక్నాలజీని అంది పుచ్చుకుని ముందుకెళ్లినప్పుడే ఏ సంస్థ అయినా మనుగడ సాగిస్తుందన్నారు. ఇంతకుముందు భారత్ అభివ్రుద్ధి సాధించాలంటే వారానికి 70 గంటలు పని చేయాల్సిందేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.