హైదరాబాద్, జూన్ 2: మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.246.50 కోట్ల ఆదాయం(15.3 శాతం వృద్ధి)పై రూ.46.1 కోట్ల నికర లాభం(41 శాతం అధికం) ఆర్జించింది ఎంటీఏఆర్ టెక్నాలజీ. మరోవైపు, రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3 తుది డివిడెండ్ను బోర్డు ప్రతిపాదించింది. ప్రస్తుతం సంస్థ చేతిలో రూ.416 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.