హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15: ప్రముఖ ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్.. మూత్ర వ్యాధిని నయం చేసే ‘ఫెసోబిగ్’ జనరిక్ విడుదల చేసింది. ఫెసోటెరోడైన్ ఫుమరేట్ ట్యాబ్లెట్కు జనరిక్ వెర్షన్గా విడుదల చేసిన ఈ ట్యాబ్లెట్లు అత్యంత చౌకదని ఎంఎస్ఎన్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరత్ రెడ్డి తెలిపారు.
దేశీయ పెటెంట్లకు తక్కువ ధర కలిగిన ఔషధాలను అందించాలనే ఉద్దేశంతో ఈ ట్యాబ్లెట్ను విడుదల చేసినట్లు చెప్పారు. రెండు రకాల్లో లభించనున్న ఈ మందు 4 ఎంజీ ట్యాబెట్ ధర రూ.17, 8 ఎంజీ ట్యాబ్లెట్ ధర రూ.27గా నిర్ణయించింది. అమెరికాలో దీని ధర రూ.1233గా ఉందన్నారు.