Citroen – MS Dhoni | ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen).. భారత్ క్రికెట్ జట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ని తమ ప్రచారకర్తగా నియమించుకున్నది. భారత్లో తమ బ్రాండ్ ప్రచారకర్తగా ఎంఎస్ ధోనీ ఉంటారని శుక్రవారం ప్రకటించింది. తమ సంస్థ ప్రచారకర్తగా ఎంఎస్ ధోనీ త్వరలో ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఓ ప్రకటనలో తెలిపింది.
‘భారత్లోని ఉత్తమ క్రికెటర్లలో ఒకరైన మహేంద్ర సింగ్తో మా అనుబంధం దేశీయ మార్కెట్లో సుదీర్ఘ కాల ప్రయాణానికి ఉన్న నిబద్ధత అని మేం విశ్వసిస్తున్నాం. ఆయన వినయం, అంకిత భావం, శ్రేష్ఠత మా బ్రాండ్ ఆలోచనలకు పరిపూర్ణంగా సరిపోతాయి. ఎంఎస్ ధోనీతో మా అనుబంధంతో సుస్థిరంగా భవిష్యత్ మొబిలిటీ బలోపేతానికి దోహదం చేస్తుంది’ అని సిట్రోన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా పేర్కొన్నారు.
‘సిట్రోన్తో నా అనుబంధం ఎలక్ట్రిక్ మొబిలిటీకి సుస్థిర పరిష్కారాలు చూపుతుంది. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా అర్థవంతమైన ఆవిష్కరణలతో ముందుకెళ్లేందుకు ఉపకరిస్తుంది’ అని ఎంఎస్ ధోనీ వ్యాఖ్యానించాడు.