న్యూఢిల్లీ : భారత్లో పలు స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసిన మొటొరోలా త్వరలో దేశీ మార్కెట్లో మరో స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేయనుంది. మోటో ఈ 40 లాంఛ్ గురించి మొటోరోలా ట్విటర్లో టీజర్ రిలీజ్ చేసింది. టీజర్లో మోటో ఈ 40 లాంఛ్ ఎప్పుడు ఉంటుందనే వివరాలు వెల్లడించకపోయినా ఈ నెలాఖరు లేదా నవంబర్ ప్రధమార్ధంలో న్యూ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు.
ఇక మొటొరోలా ఇటీవల భారత్లో మోటో ఎడ్జ్ 20 సిరీస్ను ప్రవేశపెట్టింది. మోటో ఎడ్జ్ 20, మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ను తొలుత లాంఛ్ చేసిన కంపెనీ ఆపై మోటో ఎడ్జ్ 20 ప్రొను ప్రవేశపెట్టింది. ఇక మోటో ఈ 40 ధర విషయానికి వస్తే ఈ డివైజ్ భారత్లో రూ 10,000లోపు లభించవచ్చని భావిస్తున్నారు.