దేశంలోని రహదారులపై తిరిగే ప్రతీ వాహనానికి మోటర్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అలాగే మోటర్ వెహికిల్స్ చట్టం 1988 ప్రకారం థర్డ్-పార్టీ బీమా కవరేజీ కూడా ఉండాల్సిందే. అయితే థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలను బీమా సంస్థలు కాకుండా బీమా నియంత్రణ వ్యవస్థ ఐఆర్డీఏఐ నిర్ణయిస్తుంది. ఇటీవలే ఈ ప్రీమియంలను ఐఆర్డీఏఐ సవరించగా, ఆ వివరాలిలా ఉన్నాయి.
ప్రయోజనాలివే..
మీ వాహనం వల్ల థర్డ్-పార్టీకి జరిగిన ఆస్తి నష్టాన్ని బీమా కంపెనీయే తీరుస్తుంది మీ వాహన ప్రమాదంలో ఒకవేళ మూడో వ్యక్తి గాయాలపాలైతే ఆ వైద్యం ఖర్చు బీమాలోనే కవరేజీ అవుతుంది
దురదృష్టవశాత్తు మూడో వ్యక్తి చనిపోతే లేదా శాశ్వతంగా అంగవైకల్యం బారినపడితే బాధితులకు పెద్ద మొత్తంలో బీమా సంస్థనే చెల్లిస్తుంది