ముంబై: మోటో E13..! మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అత్యంత తక్కువ ధరకే లభ్యమయ్యేలా మోటరోలా కంపెనీ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్ను రూపొందించింది. ఇప్పటికే యూరప్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా దేశాల్లోని మార్కెట్లలో ఈ ఫోన్ విడుదలైంది. త్వరలో భారత విపణిలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది.
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైల్ ఫోన్ను ఈ నెల 8న భారత్లో లాంచ్ చేసేందుకు మోటరోలా ప్లాన్ చేసింది. 4GB ర్యామ్, 64GB ఆన్బోర్డు స్టోరేజీలో ఉండే ఈ ఫోన్ మెమొరీని 1TB వరకు ఎక్స్పాండ్ చేసుకునేందుకు వీలుగా మెమొరీ కార్డు స్లాట్ కలిగి ఉంది. అదేవిధంగా 5000mAh బ్యాటరీ పవర్ కూడా ఈ మొబైల్ ఫోన్ ప్రత్యేకత.
అంతేగాక 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ విత్ హెచ్డీ ప్లస్ రిసొల్యూషన్ కలిగిన ఈ ఫోన్కు 13 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఒక్కసారి ఫుల్గా చార్జ్ చేస్తే 36 గంటలపాటు చార్జింగ్ అవసరం లేకుండా పనిచేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రూ.10 వేలకు అటుఇటుగా లభ్యమయ్యే అవకాశం ఉన్నది.