హైదరాబాద్, డిసెంబర్ 8: వీఎల్ఎస్ఐ, ఎంబెడ్డెడ్ సిస్టమ్ రంగంలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న మాస్చిప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్.. హైదరాబాద్లో అత్యాధునిక కేంద్రా న్ని ప్రారంభించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని అరబిందో గెలాక్సీలో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఫిజికల్ డిజైన్, అనలాగ్ లేఔట్, డిజైన్ వెరిఫికేషన్, ఎంబ్డెడ్ సిస్టమ్స్ విభాగాల్లో ప్రతియేటా 600 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు మాస్చిప్ ఎండీ, సీఈవో వెంకట సింహాద్రి తెలిపారు.
విద్యార్థులకు మరింత మెరుగ్గా శిక్షణ ఇచ్చేందుకు ఈడీఏ టూల్ ప్రొవైడర్ కాడెన్స్డిజైన్ సిస్టమ్స్తో ఇన్స్టిట్యూట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెమికండక్టర్ కంపెనీల్లో తమ అభ్యర్థులు పనిచేస్తున్నారని, డిమాండ్కు అనుగుణంగా పరిశ్రమకు అభ్యర్థులను అందించేందుకు ఈ కేంద్రం దోహదం చేయనున్నదన్నారు.