న్యూఢిల్లీ, మార్చి 28: దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మరిన్ని నూతన కార్లు రావడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో కొత్తగా ఐదు మాడళ్లను విడుదల చేయబోతున్నట్టు దేశీయ, అంతర్జాతీయ వాహన సంస్థలు ప్రకటించాయి. వీటిలో ఫోక్స్వ్యాగన్, ఎంజీ, మెర్సిడెజ్ బెంజ్, టయోటా, నిస్సాన్లు ఉన్నాయి. ఒకవైపు ధరలు పెంచుతున్నప్పటికీ, మరోవైపు, నూతన వాహనాలను విడుదల చేయబోతున్నాయి. వీటిలో ఇప్పటికే పలు మాడళ్లను ప్రదర్శించాయి కూడా. వీటి వివరాలు..
ఫోక్స్వ్యాగన్ మరో నయా మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేయబోతున్నది. ఐదేండ్ల తర్వాత టైగూన్ నయా మాడల్ను విడుదల చేస్తున్నది. 2021లో ఈ ఎస్యూవీని విడుదల చేసిన సంస్థ..ప్రస్తుతం ఈ మాడల్ను ఆధునీకరించి, ముఖ్యంగా కొనుగోలుదారులు కోరుకుంటున్న విధంగా పలు మార్పులు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగిన ఈ మాడల్లో ఎనిమిది గేర్లు ఉండనున్నాయి.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మరో ఎలక్ట్రిక్ మాడల్ను తీసుకురాబోతున్నది. వచ్చే నెలలో సీఎల్ఏ ఎంట్రీ-లెవల్ ఈవీ సెడాన్ను ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించింది. సింగిల్ చార్జింగ్తో 792 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్లో 14 ఇంచుల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్స్తో తీర్చిదిద్దింది. ఈ కారు ధర రూ.55 లక్షల నుంచి రూ.59 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా.
టయోటా కంపెనీ మరో ఈవీ మాడల్ అర్బన్ క్రూజర్ను ప్రవేశపెట్టబోతున్నది. 40 కిలోవాట్లు, 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో లభించనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్తో 543 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. బ్యాటరీ-యాస్-ఏ-సర్వీసెస్(బాస్) ప్రొగ్రాం పద్దతిన ఈ మాడల్ను ప్రవేశపెడుతున్నది.
నిస్సాన్ మరో ఎస్యూవీని విడుదల చేయబోతున్నది. రెనో డస్టర్కు ప్రత్నామ్నాయంగా టెక్టాన్ను తీసుకొస్తున్నది.