హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): అటల్ ఇన్నోవేషన్ సెంటర్(ఏఐసీ) భాగస్వామ్యంతో మరోసారి మొబిలిటీ స్టార్టప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీహబ్ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే రెండు దశల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఔత్సాహికుల నుంచి మంచి స్పందన రావడంతో మూడోసారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన మొబిలిటీ కార్యక్రమంలో స్టార్టప్లకు రూ.6 కోట్ల వరకు నిధులు సమకూరాయని, అదేవిధంగా రూ.2.17 కోట్ల గ్రాంట్స్, బహుమతుల రూపంలో వచ్చాయని టీ హబ్ ప్రతినిధి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింకు (https://bit.ly/3x0H7pV)
లో సంప్రదించాలని సూచించారు.