హయత్నగర్, నవంబర్ 14: నార్ముల్ పాల ఉత్పత్తిదారులకు పెండింగ్లో ఉంచిన ప్రభుత్వ ప్రోత్సాహకం రూ.7.69 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆ సంస్థ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి కోరారు. కంపెనీ ఎండీ వి అశోక్ కుమార్తో కలిసి సోమవారం ఆయన మంత్రి కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ, రంగారెడ్డి మిల్క్ యూనియన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని తెలిపారు.
కాబట్టి పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లీటరుకు రూ.3 చొప్పున నిరుడు జూన్ నుండి రావాల్సిన ప్రోత్సాహకం సొమ్ము రూ.7.69 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. గతంలో బ్యాంకుల విలీనం కారణంగా 1,235 మంది రైతులకు నిలిచిన ప్రోత్సాహక సొమ్ము రూ.1.83 కోట్లను కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, దీనిపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. యూనియన్ రైతులకు అందాల్సిన పూర్తి బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని హామీనిచ్చినట్టు ఈ సందర్భంగా శ్రీకర్రెడ్డి తెలిపారు.