సొంత ఇంటికి వచ్చినట్టుంది..
హైదరాబాద్కు రావడమంటే సొంతింటికి వచ్చినట్టు అనిపిస్తున్నది. ఇక్కడి ప్రజలు, అలవాట్లు నాకు ఎంతో నచ్చుతాయి. హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ను నెలకొల్పడానికి ఇది కూడా ఓ కారణంగానే చెప్పుకోవచ్చు. గత నాలుగేండ్లుగా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో మా సంస్థకు ఇదే ప్రధాన కేంద్రంగా మారిపోయింది. మా సంస్థకు మార్కెట్ పరంగా భారత్ ఎంతో కీలకం.
– ప్రొవిడెన్స్ ప్రెసిడెంట్, సీఈవో రోడ్నీ హోఫ్మ్యాన్
హైదరాబాద్, ఫిబ్రవరి 27: జర్మనీకి చెందిన బయోమెడికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ మిల్టెనీ బయోటెక్..భారత్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ..భవిష్యత్తులో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో జరుగుతున్న బయోఏషియా వేదికపై కంపెనీ ఎండీ బోరిస్ స్టోఫెల్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ముందస్తు క్లినికల్/క్లినికల్ డెవలప్మెంట్, వాణిజ్య అవసరాలనిమిత్తం సైంటిస్టులు, పరిశోధకులు, పరిశ్రమ వర్గాలు, క్లాస్రూమ్లో క్లినికల్కు సంబంధించి ప్రయోగాత్మక శిక్షణ పొందేందుకు వీలుగా ఈ సెంటర్ను నెలకొల్పుతున్నట్లు ఆయన చెప్పారు. దేశీయ సైంటిస్టులు, పరిశోధకులు సులభంగా వారి రిసెర్చ్లను చేయడానికి వీలు పడనున్నదని తెలిపింది. ఈ కేంద్రం శాస్త్రీయ సమాజంలో చికిత్సలను అభివృద్ధి చేయడంలోను ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు ఆరోగ్య సంక్షరణకు సహాయపడటానికి దోహదం చేయనున్నదన్నారు.