న్యూఢిల్లీ, జనవరి 24: గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ తొలిసారిగా 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలో 3 ట్రిలియన్ డాలర్ల విలువకు చేరిన తొలి కంపెనీ ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్కాగా, మైక్రోసాఫ్ట్ తాజాగా ఈ ఫీట్ సాధించింది. బుధవారం రాత్రి యూఎస్ స్టాక్ ఎక్సేంజ్లో మైక్రోసాఫ్ట్ షేరు విలువ 403.78 డాలర్ల వద్దకు పెరగడంతో మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల మార్క్ను అందుకుంది. గత ఏడాది యాపిల్ ఈ స్థాయిని చేరిన తొలికంపెనీగా చరిత్ర సృష్టించింది. తాజాగా యాపిల్ మార్కెట్ విలువ 3.03 ట్రిలియన్ డాలర్ల సమీపంలో ఉన్నది.