హైదరాబాద్, జనవరి 19: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ హ్యాపి మొబైల్స్ స్టోర్స్లో షియోమీ 11టీ ప్రొ 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. షియోమి భాగస్వామ్యంతో ఈ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు హ్యాపి మొబైల్స్ వర్గాలు వెల్లడించాయి. 108 మెగాపిక్సెల్ కెమెరా, 120 హెచ్జెడ్ అమోలెడ్ డిస్ప్లే, డాల్బీ విజన్ అట్మోస్ సౌండ్తో కూడిన ఈ ఫోన్ 17 నిమిషాల్లో నూరుశాతం ఛార్జ్ అవుతుందని హ్యాపి ఈడీ సంతోష్ తెలిపారు. రూ.39,999 ప్రారంభ ధర కాగా రూ.43,999 గరిష్ఠంగా నిర్ణయించింది. రూ.5 వేల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్తోపాటు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులపై కొనుగోలు చేసిన వారికి మరో రూ.5 వేల వరకు రాయితీ ఇస్తున్నది. తెలంగాణతోపాటు ఏపీల్లో 70కిపైగా ఉన్న తమ స్టోర్ల సంఖ్యను 2022 చివరికల్లా 120కి పెంచుతామని హ్యాపి తెలిపింది.