న్యూఢిల్లీ : భారత్లో వచ్చే వారం ఎంజీ ఆస్టర్ లాంఛ్ కానుంది. ఈ వాహనం ధర వివరాలను ఈనెల 11న కంపెనీ వెల్లడించనుంది. పెట్రోల్ వెర్షన్లోనే అందుబాటులో ఉండే ఈ ఎస్యూవీ హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిసాన్ కిక్స్, రెనాల్ట్ డస్టర్, స్కోడా కుశక్, వోక్స్వ్యాగన్ టైగన్లకు భారత్ మార్కెట్లో దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. న్యూ ఎంజీ ఆస్టర్ ఐసీఈ పవర్డ్ ఎంజీ జడ్ఎస్ ఈవీకి జోడీగా రానుంది.
ఎంజీ ఆస్టర్ 8 ట్రిమ్ లెవెల్స్ స్టైల్, సూపర్, స్మార్ట్ ఎస్టీడీ, స్మార్ట్, షార్ప్, ఫార్ప్ ఎస్టీడీ, శావీ, శావీ రెడ్ ట్రిమ్ లెవెల్స్లో అందుబాటులో ఉంటుంది. అత్యాధునిక ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ ఫీచర్లతో ఎంజీ ఆస్టర్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. 10.1 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ టచ్స్క్రీన్, వైర్లెస్ చార్జింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, స్పీడ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో న్యూ ఎంజీ ఆస్టర్ కస్టమర్ల ముందుకు రానుంది.