Reliance-Walt Disney | భారత్లో రిలయన్స్ అనుబంధ వయాకాం 18 సంస్థతో ఒప్పందం వల్ల తమ రెండు సంస్థలకు లబ్ధి చేకూరుతుందని వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ చెప్పారు. దీనివల్ల ఎంటర్టైన్మెంట్ రంగంలో పెద్ద సంస్థ ఏర్పాటుతోపాటు మార్కెట్లోనూ అగ్రస్థానంలో నిలుపుతుందని మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్టర్ల సదస్సులో మాట్లాడుతూ బాబ్ ఐగర్ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారత్లో కొనసాగాలని ఆశిస్తున్నా.. మార్కెట్లో నెలకొన్న కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందని బాబ్ ఐగర్ వెల్లడించారు. అందుకోసమే అతిపెద్ద మీడియా సంస్థలో వాటాను సొంతం చేసుకోవడంతో రెండు సంస్థలూ మొదటి స్థానంలో ఉంటాయన్నారు. రిలయన్స్తో భాగస్వామ్యం వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని, నష్ట భయం తగ్గుతుందన్నారు.రిలయన్స్-వాల్ట్ డిస్నీ మధ్య కుదిరిన ఒప్పందం విలువ రూ.70,352 కోట్లు.
రెండు సంస్థల జాయింట్ వెంచర్ సంస్థలో రిలయన్స్ రూ.11,500 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ మీడియా జాయింట్ వెంచర్ సంస్థకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ చైర్పర్సన్గా, వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్గా ఉంటారు. రిలయన్స్, వాల్ట్ డిస్నీ జాయింట్ వెంచర్ సంస్థలో స్టార్ ఇండియాకు చెందిన ఎనిమిది బాషల 70 చానళ్లు, రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకాం 18 నుంచి 38 చానెళ్లతోపాటు మొత్తం 120 చానెళ్లు చేరతాయి. వీటితోపాటు డిస్నీ హాట్ స్టార్, జియో సినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్లు కూడా ఉంటాయి.