Benz EQS | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కార్లు అమ్ముడవుతున్న కంపెనీల్లో టెస్లా మొదటి స్థానంలో ఉంటుంది. ఇది విద్యుత్ కార్లకు ప్రసిద్ధి. భారత్ మార్కెట్లోకి ప్రవేశించాలని టెస్లా సీఈవో ఎలన్మస్క్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీని కంటే ముందుగానే భారత మార్కెట్లో అడుగు పెట్టేందుకు మరో లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ సిద్ధమైంది.
తన ఫ్యాన్సీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్, సెడాన్ కార్లను మార్కెట్లోకి తేవాలని తలపోస్తున్నది. ఇందులో భాగంగా 2022 బెంజ్ ఈక్యూఎస్ 450 +పేరుతో విపణిలోకి తీసుకొస్తున్నది మెర్సిడెస్ బెంజ్. ఈ కారును ఒకసారి పూర్తిగా చార్జి చేస్తే 770 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. టెస్లా కారు కంటే 20 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం.
ఈ కారు ధర రూ.76,07,899 (1,02,310 డాలర్లు). అంతే కాదు ఈ కారు మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తున్నది. కేవలం 5.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. 107.8 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన బ్యాటరీ గల ఇంజిన్ను అమర్చారు. ఈ కారు ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ 30 నిమిషాల్లో 80 శాతం చార్జి అవుతుంది.