సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): డిజిటల్ హెల్త్ కేర్ రంగానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ-సీఐఈ ఇంక్యుబేషన్ సెంటర్లో స్టార్టప్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హెల్త్ కేర్కు సంబంధించి సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఇప్పటికే సీఐఈలో ఓజాస్ మెడ్టెక్ బయో నెస్ట్, బైరాక్, టీ-హెల్త్ సంస్థలతో కలిసి హెల్త్ కేర్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా హెల్త్కేర్ రంగంలో నిపుణులైన ప్రణయ్ గార్గ్, డాక్టర్ వికాస్ సాహూలతో 28న వర్చువల్గా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మెడిటెక్ రంగంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు నిపుణుల ఈ సమావేశం దోహదం చేస్తుందని, ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు ఈ కింది లింక్లో https://cie.iiit.ac.in/events లో సంప్రదించాలని తెలిపారు.