MedPlus | హైదరాబాద్, ఫిబ్రవరి 10: ప్రముఖ ఔషధ రిటైల్ దిగ్గజం మెడ్ప్లస్..జనరిక్ ఔషధాలపై ప్రత్యేక దృష్టి సారించింది. స్టోర్ జనరిక్ కాన్సెప్ట్తో కస్టమర్లకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించాలనే ఉద్దేశంతో సొంత బ్రాండ్తో ఔషధాలను విక్రయిస్తున్నది. ఆరు నెలల క్రితం హైదరాబాద్లో ప్రారంభించిన ఈ స్టోర్ జనరిక్ కాన్సెప్ట్తో కస్టమర్లకు 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు ధరతో అందిస్తుండటంతో కోట్లాది రూపాయలు ప్రయోజనం చేకూరిందని కంపెనీ ఎండీ, సీఈవో మధుకర్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం 600 జనరిక్ ఔషధాలను మెడ్ప్లస్ బ్రాండ్తో విక్రయిస్తున్నట్లు, భవిష్యత్తులో వీటిని 800కి పెంచుకోవాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కస్టమర్లకు నాణ్యమైన జనరిక్ ఔషదాలను అందించడానికి పలు సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు, దీంట్లోభాగంగా అకూమ్స్ డ్రగ్ అండ్ ఫార్మా, విండ్లాస్ బయోటెక్ వంటి అగ్రగామి సంస్థలతోనూ జతకట్టినట్టు చెప్పారు. స్టోర్ జనరిక్ మెడిసిన్లలో 26 లక్షల మంది కస్టమర్లకు రూ.139 కోట్లు ఆదా అయ్యాయి. ఆరు నెలల క్రితం తెలంగాణతోపాటు ఆరు రాష్ర్టాల్లో ఈ ప్రత్యేక మాడల్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం సంస్థకు 4,200 అవుట్లెట్లు ఉండగా, వచ్చే ఏడాదికాలంలో మరో 600 స్టోర్లను ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.