న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్య భయాలు, ఆర్దిక మందగమనంతో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు మాస్ లేఆఫ్స్కు తెగబడుతుంటే బర్గర్ దిగ్గజం మెక్డొనాల్డ్ భారత్లో 5000 మందిని నియమించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
2025 నాటికి భారత్లో తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తామని మెక్డొనాల్డ్ ఇండియా వెల్లడించింది. 2025 నాటికి ఉత్తర, తూర్పు ప్రాంతంలో అవుట్లెట్ల సంఖ్యను 300కు పెంచాలని యోచిస్తోంది. విస్తరణ ప్రణాళికలో భాగంగా మెక్డొనాల్డ్ గువహటిలో అతిపెద్ద రెస్టారెంట్ను ప్రారంభించింది.
6700 చదరపు గజాల విస్తీర్ణంలో ఒకే సమయంలో 220 మందికి ఆతిధ్యం ఇచ్చేలా ఈ రెస్టారెంట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాబోయే మూడేండ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు కసరత్తు సాగిస్తున్నామని మెక్డొనాల్డ్స్ ఇండియా ఎండీ రాజీవ్ రంజన్ తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 5000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, మూడేండ్లలో ఈ సంఖ్య రెట్టింపు చేస్తామని చెప్పారు.