Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.71,301 .34 కోట్లు పెరిగింది. భారతీ ఎయిర్ టెల్ భారీగా లబ్ధి పొందింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 374.04 పాయింట్లు (0.50 శాతం) లాభ పడింది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు పని చేయలేదు. గురువారం బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 74,119.39 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 22,493.55 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ లబ్ధి పొందాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్పోసిస్, ఎల్ఐసీ నష్టాలతో ముగిశాయి.
భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,726.67 కోట్లు పెరిగి రూ.6,77,448.44 కోట్లకు చేరింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.13,476.16 కోట్లు పుంజుకుని రూ.7,03,393.29 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,243.35 కోట్లు పెరిగి రూ.10,98,707.88 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.3,099.76 కోట్లు పెరిగి రూ.7,63,581.30 కోట్ల వద్ద స్థిర పడింది.ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,469.81 కోట్లు పెరిగి రూ.5,15,921.57 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.1,157.79 కోట్లు పుంజుకుని రూ.14,87,070.15 కోట్ల వద్ద ముగిసింది. హెచ్యూఎల్ ఎం-క్యాప్ రూ.1,127.8 కోట్లు పెరిగి రూ.5,68,753.81 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,875.81 కోట్లు పెరిగి రూ.6,71,121.34 కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.15,391.94 కోట్ల నష్టంతో రూ.20,01,358.50 కోట్ల వద్ద నిలిచింది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.6,166.87 కోట్ల నష్టంతో 6,48,596.89 కోట్ల వద్ద నిలిచింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హెచ్యూఎల్, ఐటీసీ నిలిచాయి.