ముంబై, మార్చి 29: స్టాక్ బ్రోకర్ల ద్వారా జరిగే మోసాలను గుర్తించేందుకు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలో మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఓ పటిష్ట వ్యవస్థను తీసుకురానున్నది. ఈ మేరకు స్టాక్ బ్రోకర్ల రెగ్యులేషన్స్కు సవరణలు చేయనున్నది. ఆమోదిత సవరణలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్గత నియంత్రణ, ట్రేడింగ్ కార్యకలాపాల నిఘా కోసం ఓ విజిల్-బ్లోయర్ పాలసీని కూడా పరిచయం చేయనున్నది. బుధవారం ఇక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు సమావేశం జరిగింది. ఇందులో పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కాగా, దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో మరో కార్వీ ఇష్యూను రానివ్వబోమని, ఒకవేళ అలాంటిది జరిగితే అది మన మృతదేహాలపైనేనని బోర్డు సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సెబీ చైర్పర్సన్ మధాబి పురి బుచ్ అనడం గమనార్హం. ఇక సెబీ నిర్ణయాల్లో..