హైదరాబాద్, డిసెంబర్ 12: అమర రాజా గ్రూపునకు చెందిన మంగల్ ఇండస్ట్రీస్..తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. చిత్తూరు జిల్లాలో రూ.250 కోట్ల పెట్టుబడితో నూతన యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు సోమవారం ప్రకటించింది. 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్లో ఆటో విడిభాగాలు, మెటల్ ఫ్యాబ్రికేషన్, బ్యాటరీ కంపొనెంట్లను ఉత్పత్తి చేస్తున్నది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యూనిట్ను నెలకొల్పుతున్నట్లు అమర రాజా గ్రూపు కో-ఫౌండర్ జయదేశ్ గల్లా తెలిపారు. ఈ సరికొత్త యూనిట్తో మరో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.