లండన్ : బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి అమెజాన్ నుంచి మ్యాక్బుక్ ప్రోకు ఆర్డర్ ఇవ్వగా ఖరీదైన ల్యాప్టాప్కు బదులు ఐదు పౌండ్ల విలువ చేసే డాగ్ ఫుడ్ రావడంతో అతడు కంగుతిన్నాడు. యాపిల్ ప్రోడక్ట్స్కు బదులు కస్టమర్లకు తప్పుడు ఆర్డర్లు రావడం ఇదే తొలిసారి కాదు. భారత్కు చెందిన ఓ వ్యక్తి ఐఫోన్కు ఆర్డరిస్తే ఫ్లిప్కార్ట్లో అతడికి డిటర్జెంట్ బార్ వచ్చింది. కస్టమర్ ఫిర్యాదుతో కంపెనీ అతడు చెల్లించిన మొత్తం రిఫండ్ చేసింది. ఇక బ్రిటన్కు చెందిన అలన్ వుడ్ తన కూతురు కోసం నవంబర్ 29న అమెజాన్లో రూ. 1,20,000 విలువైన మ్యాక్బుక్ ప్రోను ఆర్డర్ చేశాడు.
ఆపై ఆయనకు ఐదు పౌండ్ల విలువైన 24 ప్యాకెట్లతో కూడిన డాగ్ ఫుడ్ రావడంతో షాక్కు గురయ్యాడు. మ్యాక్బుక్ ప్రోకు బదులు తాను ప్యాక్ తెరవగానే డాగ్ ఫుడ్ కనిపించగానే నా ముఖం ఎలా మారిందో మీరు ఊహించగలరని వుడ్ చెప్పుకొచ్చారు. ఈ విషయం తాను ఈకామర్స్ కంపెనీ దృష్టికి తీసుకురాగానే అమెజాన్ సపోర్ట్ టీం తనకు ఎలాంటి సహకారం అందించలేదని వెల్లడించారు. డాగ్ఫుడ్ను తాను వేర్హౌస్కు తిప్పిపంపినా తనకు ల్యాప్టాప్ రాలేదని వుడ్ చెప్పుకొచ్చారు.
అమెజాన్కు పలుసార్లు ఫోన్ చేసినా ఫలితం లేదని వాపోయారు. తాను అమెజాన్కు కాల్ చేస్తూ ఏకంగా 15 గంటల సమయం వెచ్చించానని చెప్పారు. మేనేజర్లకు ఇతర డిపార్ట్మెంట్లకు విషయాన్ని చేరవేసినా తనకు ఎలాంటి ఊరట లభించలేదని అన్నారు. తన సమస్యను వారికి వివరించినా తన గోడు వినేందుకు కూడా వారు అంగీకరించలేదని అన్నారు. తాను రెండు దశాబ్ధాలుగా అమెజాన్ కస్టమర్నని, వారితో అంతకుముందు తనకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదని వుడ్ చెప్పారు. మరోసారి అమెజాన్తో ఎలాంటి డీల్ పెట్టుకోనని తేల్చిచెప్పారు. కాగా వుడ్ సమస్య తమ దృష్టికి వచ్చిందని ఆయనకు పూర్తి మొత్తం రిఫండ్ చేస్తామని అమెజాన్ ప్రతినిధి తెలిపారు.