హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ) : జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి హైదరాబాద్కి చెందిన మైత్రా ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఆస్తులను కొనుగోలు చేయబోతున్నది.
ఒప్పందం విలువ రూ. 10,530 కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర నియంత్రణ మండలులు అనుమతించాల్సి ఉంటుంది. మైత్రాకు దేశవ్యాప్తంగా 10 పవన విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయి. దానిద్వారా ప్రతియేటా 1331 మె.వా. విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఏడు సోలార్ ప్లాంట్లు కూడా నిర్వహిస్తుంది.