న్యూఢిల్లీ, జనవరి 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ప్రత్యేక ఎడిషన్గా ఎక్స్యూవీ 400 ఈవీని విడుదల చేసింది. రెండు చార్జింగ్ ఆప్షను కలిగిన ఈ మాడల్లో 3.3 కిలోవాట్ల ధర రూ.15.99 లక్షలుగాను, 7.2 కిలోవాట్ల ధర రూ.16.49 లక్షలుగా నిర్ణయించింది. ఒక్కసారి రీచార్జితో 3.3 కేవీ కలిగిన బ్యాటరీ 375 కిలోమీటర్లు, 7.2 కేవీ కలిగిన బ్యాటరీ 456 కిలోమీటర్ల మైలేజి ఇవ్వనున్నది.