ముంబై, మే 30: మహీంద్రా అండ్ మహీంద్రా.. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్యూవీ 300 ఎస్యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల చేసే యోచనలో ఉన్నది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం ‘బర్న్ ఎలక్ట్రిక్ విజన్’ అనే పేరుతో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఆగస్టులో ఈవీల వ్యాపారం ప్రారంభించబోతున్నది.
ఇందుకోసం ఫోక్స్వ్యాగన్తో జతకట్టింది కూడా. ఎక్స్యూవీ 300 ఎలక్ట్రిక్ వెర్షన్ను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల చేయాలనుకుంటున్నట్లు మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ తెలిపారు. 4.2 మీటర్ల పొడవుతో తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ఎక్స్యూవీ 700కి డిమాండ్ అధికంగా ఉన్నదని, వెయి టింగ్ పీరియడ్ 18-24 నెలలు ఉండటంతో కస్టమర్లు బుకింగ్లను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.