XUV400 EV Bookings |మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 400 కార్లపై ఆసక్తి కల వారు బుకింగ్స్ చేసుకోవచ్చు. ఢిల్లీలో ఎక్స్ షో రూమ్ ప్రకారం ఈ మోడల్ ఈసీ వేరియంట్ కారు రూ.15.99 లక్షలు, ఈఎల్ వేరియంట్ ధర రూ.18.99 లక్షలు ఉండొచ్చు. ఈ ధరలు తొలి 5000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. కేవలం రూ.5000 పే చేసి కస్టమర్లు తమ కారు బుక్ చేసుకోవచ్చు.
వివిధ దశల్లో వివిధ నగరాల పరిధిలో ఈ కారును డెలివరీ చేయనున్నది మహీంద్రా అండ్ మహీంద్రా. తొలి దశలో అహ్మదాబాద్, సూరత్, జైపూర్, ముంబై ఎంఎంఆర్, నాసిక్, గోవాలోని వెర్నా, ఫుణె, నాగ్పూర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, హైదరాబాద్, చండీగఢ్, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, డెహ్రడూన్, కోయంబత్తూర్, ఔరంగాబాద్, భువనేశ్వర్, కొల్హాపూర్, మైసూర్, మంగళూరు, వడోదర, పాట్నా, కాలికట్, రాయ్పూర్, లుధియానా, ఉదయ్పూర్, జమ్ము, గువహటి, లక్నో, ఆగ్రా, ఇండోర్ నగరాల పరిధిలో డెలివరీ చేస్తుంది.
మార్కెట్లో ఆవిష్కరించిన ఏడాదిలోపు 20 వేల మంది కస్టమర్లకు ఎక్స్యూవీ400 ఈవీ కారు డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఎక్స్యూవీ 400 ఈఎల్ వేరియంట్ కారును మార్చి నుంచి డెలివరీ చేస్తుంది. దీపావళి నుంచి ఈసీ వేరియంట్ కారు డెలివరీ ప్రారంభం అవుతుంది. బ్యాటరీ ప్యాక్ మీద ఎనిమిదేండ్లు లేదా1.60 లక్షల కి.మీ. దూరం వారంటీ అందచేస్తుంది.
కస్టమర్లు మహీంద్రా అధికారిక వెబ్సైట్లోకి ఎక్స్యూవీ 400 ఈవీ కారు బుక్ చేసుకోవచ్చు. మీ పూర్తి వివరాలు నమోదు చేసి సైనప్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత వెహికల్ వేరియంట్, దాని కలర్ ఎంచుకోవాలి. మీకు దగ్గరలోని డీలర్షిప్ కూడా ఎంచుకోవాలి. వ్యక్తిగత వివరాలు చెక్ చేసుకున్న తర్వాత రూ.5000 పే చేస్తే ఎస్యూవీ ఎక్స్యూవీ 400 ఈవీ కారు మీ సొంతం అవుతుంది.