న్యూఢిల్లీ : న్యూ స్కార్పియో-ఎన్ డెలివరీలు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతాయని మహింద్ర అండ్ మహింద్ర ప్రకటించింది. నవరాత్రులు ప్రారంభమయ్యే రోజును డెలివరీలకు శ్రీకారం చుట్టేందుకు కంపెనీ ఎంచుకుంది. డెలివరీలు ప్రారంభమైన తొలి పదిరోజుల్లో 7000 యూనిట్లను డెలివర్ చేసేందుకు ఎంఅండ్ఎం సన్నాహాలు చేపట్టింది.
టాప్ఎండ్ వేరియంట్ జడ్8-ఎల్ డెలివరీలకు కంపెనీ ప్రాధాన్యత ఇవ్వనుంది. స్కార్పియో-ఎన్28-ఎల్ను తొలి 25,000 బుకింగ్స్లో బుక్ చేసుకున్న కస్టమర్లు కేవలం రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ అనంతరం వాహనాన్ని పొందుతారు.
ఇక ఇతర వేరియంట్స్కు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ భిన్నంగా ఉంటుందని, తొలి 25,000 బుకింగ్స్కు ప్రాధాన్యత ఇస్తూ నాలుగు నెలల్లో వారి వాహనాలను డెలివర్ చేస్తామని ఎంఅండ్ఎం ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెండ్ విజయ్ నక్రా వెల్లడించారు. మహింద్ర స్కార్పియో-ఎన్ కేవలం 30 నిమిషాల్లోనే లక్ష బుకింగ్స్తో రికార్డ్ సృష్టించింది.