ముంబై, ఫిబ్రవరి 27 : దేశీయ వాహన తయారీ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. తెలంగాణ మార్కెట్కు తమ నూతన రోటావేటర్ సిరీస్ను పరిచయం చేసింది. మహావతార్, మహావతార్ హెచ్డీ పేరిట హెవీ-డ్యూటీ రోటావేటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి భూముల్లోనైనా ఇవి సమర్థవంతంగా పనిచేయగలవని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది.
కాగా, అన్ని రకాల పంటలకు అనువైన కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని శుక్రవారం సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇప్పటికే మహీంద్రా ట్రాక్టర్లు దేశీయ వ్యవసాయ రంగంలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లతోపాటు రైతులకు ఉపయోగపడేలా పంట సాగులో అవసరమైన అన్నిరకాల ఉత్పత్తులనూ మహీంద్రా మార్కెట్లోకి తెస్తున్నది. ఇందులోభాగంగానే సరికొత్త రోటావేటర్లను తీసుకొచ్చింది.