న్యూఢిల్లీ, మార్చి 20: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా..మిత్రా ఆగ్రో ఈక్విప్మెంట్ లిమిటెడ్ను హస్తగతం చేసుకున్నది. ఆర్థిక వివరాలు వెల్లడించలేదు. వ్యవసాయ ఉత్పత్తుల విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ కొనుగోళ్లు జరిపింది. గడిచిన ఐదేండ్లలో వ్యవపాయ యంత్రాల వ్యాపారం 10 రెట్లు పెరగడం, తోటల పెంపకం పరికరాలు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కారణమని ఎంఅండ్ఎం ఫార్మ్ ఈక్విప్మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు. 2012లో దేవ్నీత్ బజాజ్.. మిత్రాను ప్రారంభించారు.