ముంబై, డిసెంబర్ 6: ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వాహన ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. వచ్చే నెల నుంచి అన్ని రకాల ఎస్యూవీలు, కమర్షియల్ వాహన ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది. ద్రవ్యోల్బణం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వాహన ధరలను పెంచుతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఎంతమేర పెంచేదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.